అక్టోబరు 15 నుంచి 29 వరకు ప్రత్యేక రైళ్లు

అక్టోబరు 15 నుంచి 29 వరకు ప్రత్యేక  రైళ్లు

సికింద్రాబాద్, వెలుగు: దసరా, దీపావళి పండుగల  సందర్భంగా  తమ సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం వివిధ మార్గాల్లో 20 స్పెషల్​ ట్రైన్​లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు అక్టోబరు 15 నుంచి 29 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

తిరుపతి, -సాయినగర్,​ షిర్డీ, కాజీపేట, -దాదార్, హైదరాబాద్​, -రక్సెల్, సికింద్రాబాద్, ​-ధన్​పూర్​,  కాచిగూడ తదితర స్టేషన్ల మధ్య  ఈ రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.