సికింద్రాబాద్, వెలుగు : పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం స్పెషల్ ట్రైన్లు నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. జూన్ మెుదటి వారం నుంచి జంట నగరాలగుండా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు చెప్పారు. హైదరాబాద్– రక్సోల్ మధ్య నడిచే స్పెషల్ ట్రైన్ జూన్3, 10, 17, 24వ తేదీల్లో హైదరాబాద్ నుంచి బయల్దేరుతుందని ఆఫీసర్లు వెల్లడించారు. రక్సోల్–సికింద్రాబాద్ మధ్య నడిచే ట్రైన్ రక్సోల్ నుంచి జూన్ 6, 13, 20, 27వ తేదీల్లో బయల్దేరనున్నట్లు వివరించారు. ఇక, సికింద్రాబాద్-– ధనపూర్ మధ్య నడిచే ట్రైన్ జూన్ 3, 10, 17, 24వ తేదీల్లో సికింద్రాబాద్ నుంచి..ధనపూర్–సికింద్రాబాద్ మధ్య నడిచే రైలు ధనపూర్ నుంచి జూన్5, 12, 19,26వ తేదీల్లో బయల్దేరుతుందని తెలిపారు. అలాగే, కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి ప్రతి గురువారం స్పెషల్ వీక్లీ ట్రైన్ నడపనున్నారు. తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి కాచిగూడకి ప్రతి శుక్రవారం రానుంది.