పీస్ పీస్ అయిన విమానం.. ముక్కలైన శరీర భాగాలు.. భయంకరంగా విమాన ప్రమాదం

పీస్ పీస్ అయిన విమానం.. ముక్కలైన శరీర భాగాలు.. భయంకరంగా విమాన ప్రమాదం

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రం.. అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దృశ్యాలు ఘోరంగా ఉన్నాయి. కుప్పకూలిన విమానం పేలిపోయింది. దీంతో పీస్ పీస్ అయ్యింది ఫ్లయిట్. వెనక భాగం ముక్క మాత్రమే కనిపిస్తుంది. మిగతా విమానం భాగం అంతా అట్ట ముక్కలుగా మారిపోయింది. ఇక విమానంలోని ప్రయాణికులు గుర్తు పట్టలేనంతగా ఉన్నారు. శరీర భాగాలు తెగిపోయాయి. కొన్ని శరీర భాగాలు చల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం అంతా భయానకంగా ఉంది. చూడటానికే భయంకరమైన రణ భూమిగా కనిపిస్తుంది. 

విమానం కుప్పకూలిన సమయంలో పెద్ద ఎత్తున పేలిపోవటంతో విమానం దాదాపు ముక్కలు ముక్కలు అయ్యింది. కొంత భాగం మాత్రమే.. అది కూడా వెనక భాగం మాత్రమే ఉంది. ఇంజిన్ భాగం తుక్కుతుక్కు అయ్యింది. విమాన ప్రమాదం జరిగిన ప్రదేశం చుట్టూ ఉన్న భవనాలు బాగా దెబ్బతిన్నాయి. నల్లగా మారిపోయాయి. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లు కూడా బతికే అవకాశం లేదు. విమానంలోని ప్రయాణికులు చాలా మంది కాలిపోయి.. చెల్లాచెదురుగా పడి ఉన్నారు. 

మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. విమాన ప్రమాద ఘటన స్థలం స్మశానాన్ని తలపిస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 100 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. 40 మృతదేహాలను అహ్మదాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు సమచారం. ఘటన స్థలానికి సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. ఈ హృదయవిదారక దృశ్యాలు  పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి.  

Also Read : వీడియో : విమానం ఇలా కూలిపోయింది.. కెమెరాలో రికార్డ్ అయిన చివరి క్షణాలు

కాగా, గుజరాత్‎లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని మేఘాని నగర్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తోన్న ఎయిర్ ఇండియా విమానం జనవాసాల మధ్య కుప్పకూలింది. ప్రమాదానికి గురైన విమానం అహ్మదాబాద్‎లోని సర్దార్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తోంది.

క్రాష్ అయిన ఫ్లైట్ బోయింగ్ కంపెనీకి చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్. అందులో 230 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో సహా 242 మంది ఉన్నట్లు తెలిసింది. గురువారం (జూన్ 12) మధ్యాహ్నాం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన నిమిషాల్లోనే విమానాశ్రయం సమీపంలోని మేఘాని నగర్ ప్రాంతంలో విమానం క్రాష్ అయ్యింది. కాలనీలో ఇళ్లపై కుప్పకూలింది. మేఘాని నగర్ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.