ఆ 5 నిమిషాల్లో ఏం జరిగింది:విమాన ప్రమాదానికి కారణాలు ఇవే..!

ఆ 5 నిమిషాల్లో ఏం జరిగింది:విమాన ప్రమాదానికి కారణాలు ఇవే..!

గుజరాత్లో ఘోరవిమానం ప్రమాదం..అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లో క్రాష్.. ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రాణాలు..గురువారం(జూన్ 12) అహ్మదాబాద్ లో ఏం జరిగింది. టేకాఫ్ అయిన నిమిషాల్లో విమానం ఎలా కూలింది??..  

DGCA తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్ నుంచి మధ్యాహ్నం1:38 గంటలకు  బోయింగ్787 డ్రీమ్‌లైనర్ విమానం రన్‌వే 23 నుండి బయలుదేరింది. టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే కూలిపోయింది. టేకాఫ్ అయిన వెంటనే 625 అడుగుల ఎత్తులో, 174 నాట్ల వేగంతో నిమిషానికి 895 అడుగులు ఎత్తుల ప్రయాణించి ఎయిర్ పోర్టు సరిహద్దు గోడ సమీపంలో జనవాసాల్లో  కుప్పకూలింది.

విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు.వీరిలో 232 మంది ప్రయాణీకులు, 2 మంది పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ సభ్యులు ఉన్నారు. మాజీ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది. విమానంలో 53 మంది బ్రిటిష్ పౌరులు ఉన్నట్లు సమాచారం. విమానం విమానాశ్రయం పరిసర గోడను ఢీకొని, రిహాయిషీ ప్రాంతంలోని ఐజీబీ గ్రౌండ్ సమీపంలో కుప్పకూలింది. ఘటనా స్థలం నుంచి దట్టమైన పొగలు ఆకాశంలో కనిపించాయి. ప్రమాదంలో అనేక ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.. ఇంకా వివరాలుతెలియాల్సి ఉంది. 

Also Read : విమాన ప్రమాదంపై స్పందించిన చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్.. ఏం చెప్పారంటే..?

విమానంలోని చాలా భాగాలు కాలిపోయాయి.విమానం ఢీకొన్న భవనం కూడా కూడా భారీగా ధ్వంసమైంది. విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న సివిల్ హాస్పిటల్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. గాయపడిన వారికి తక్షణ సంరక్షణ అందేలా వైద్యుల సెలవులను రద్దు చేశారు.