Air India: విమాన ప్రమాదంపై స్పందించిన చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్.. ఏం చెప్పారంటే..?

Air India: విమాన ప్రమాదంపై స్పందించిన చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్.. ఏం చెప్పారంటే..?

N Chandrasekaran: అహ్మదాబాదులో ఘోర విమాన ప్రమాదం ఒక్కసారిగా దేశంలోని ప్రజలను షాక్ కి గురిచేసింది. దాదాపు 242 మందితో వెళుతున్న విమానం 5 నిమిషాల్లో కుప్పకూలటం గందరగోళానికి గురిచేస్తోంది. ఎయిర్ పోర్ట్ సమీపంలోని జనావాసాలపై ఇది కుప్పకూలటంతో ఎంత మంది చనిపోయారనే వివరాలు తెలియాల్సి ఉంది. 

ప్రమాదంపై సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటన తనను కలచివేసిందన్న ఆయన వెంటనే అహ్మదాబాద్ బయలుదేరి వెళుతున్నట్లు ప్రకటించారు. ప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలు పూర్తిస్థాయిలో ప్రారంభించినట్లు గుజరాత్ ముఖ్యమంత్రి తెలిపారు. ఇండిగో విమానా సంస్థ కూడా ప్రమాదంపై స్పందిస్తూ తాము ఎయిర్ ఇండియాకు అండగా నిలుస్తామని ప్రకటించింది. 

Also Read : పీస్ పీస్ అయిన విమానం.. ముక్కలైన శరీర భాగాలు.. భయంకరంగా విమాన ప్రమాదం

 

చంద్రశేఖరన్ స్పందన..
విమాన ప్రమాదం తనను కలచివేసినట్లు పేర్కొన్న ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రమాదాన్ని దృవీకరించారు. తమ ఎయిర్ ఇండియా విమానం 171 అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళుతున్న సమయంలో ప్రమాదానికి గురైనట్లు చెప్పారు. ఈ ప్రమాదం వల్ల ప్రభావితం అయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుత సమయంలో తమ ప్రధాన కర్తవ్యం విమానంలో ఉన్న ప్రయాణికుల కుటుంబాలకు అండగా నిలబడటమేనని ఆయన అన్నారు. ఈ క్రమంలో ఎమర్జెన్సీ రెస్పాన్ బృందాలకు తమ సాయిశక్తులా సహాయం చేస్తున్నామని, తమ కస్టమర్ కేర్ టీమ్ కూడా సమాచారం అందిస్తోందన్నారు. మిగిలిన విషయాలు తమకు తెలిసిన వెంటనే పంచుకుంటామని వెల్లడించారు.