- కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్,వెలుగు:స్కూళ్లలో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతుల పనులను స్పీడప్ చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు ఆఫీసులో స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనపై విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
పనుల్లో ఏ మాత్రం ఆలస్యం వహించినా సహించమన్నారు. ప్రతీ పనికి స్పష్టమైన టైమ్లైన్ ఖరారు చేసి నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. హెచ్ఎంలు, ఏంఈవోలు సూచించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. పెండింగ్ లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులు వెంటనే చెల్లించాలని ఆదేశించారు.
రాష్ట్ర స్థాయి పీఎం శ్రీ సమీక్షలో భాగంగా ఈ నెల 21న ఉన్నతాధికారులు జిల్లాకు రానున్న నేపథ్యంలో బోథ్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు.
