ఆగష్టు 29న ఉద్యోగులకు క్రీడా పోటీలు

ఆగష్టు 29న ఉద్యోగులకు క్రీడా పోటీలు

వికారాబాద్, వెలుగు : మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 29న పరిగి ఇండోర్ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడలు, యువజన శాఖ అధికారి హన్మంత్ రావ్ తెలిపారు. 

ఆసక్తి కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 28 లోపు వాట్సప్​ నంబర్ 9676638201కు సమాచారం ఇచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. 50 మీ., 100 మీ. రన్నింగ్, టీటీ తదితర పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.