WFI అసిస్టెంట్ సెక్రటరీపై సస్పెన్షన్ వేటు..టోర్నీల రద్దు

WFI అసిస్టెంట్ సెక్రటరీపై సస్పెన్షన్ వేటు..టోర్నీల రద్దు

న్యూఢిల్లీ: రెజ్లింగ్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా (డబ్ల్యూఎఫ్​ఐ) రోజువారి కార్యకలాపాలను చూసేందుకు ఓ పర్యవేక్షణ కమిటీని సెంట్రల్ స్పోర్ట్స్​ మినిస్ట్రీ ఆదివారం ప్రకటించనుంది. ఇందులో ముగ్గురు సభ్యులు ఉండనున్నారు. ఈ మేరకు శనివారం స్పోర్ట్స్​ మినిస్టర్​ అనురాగ్​ ఠాకూర్​, సెక్రటరీ సుజాత చతుర్వేది, సాయ్​ డీజీ సందీప్​ ప్రధాన్​ రెండు గంటల పాటు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.  

ప్రెసిడెంట్​ బ్రిజ్​ భూషణ్​ శరణ్​ సింగ్​పై వచ్చిన లైంగిక, అవినీతి ఆరోపణలను కూడా ఈ కమిటీ విచారించనుంది. మరోవైపు డబ్ల్యూఎఫ్​ఐ అసిస్టెంట్‌‌ సెక్రటరీ వినోద్‌‌ తోమర్‌‌ను మినిస్ట్రీ సస్పెండ్‌‌ చేసింది. అలాగే, గోండా (యూపీ)లో జరుగుతున్న ర్యాంకింగ్​ టోర్నీ సహా అన్ని పోటీలను రద్దు చేయాలని ఆదేశించింది. అనురాగ్‌‌తో మీటింగ్ తర్వాత తమ ఆందోళన విరమిస్తున్నట్టు రెజ్లర్లు శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించారు. కాగా,  బ్రిజ్‌‌,ఫెడరేషన్​పై రెజ్లర్లు చేసిన అన్ని ఆరోపణలను డబ్ల్యూఎఫ్​ఐ కొట్టి పారేసింది. రెజ్లర్లు రహస్య ఎజెండాతో పని చేస్తున్నారని ఆరోపించింది.