
హనుమకొండ సిటీ, వెలుగు: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ సంస్థకు చెందిన విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారని ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోశ్ రెడ్డి వెల్లడించారు. జాతీయ స్థాయిలో అన్ని కేటగిరీలు కలిపి ఎం. రవిచంద్రారెడ్డి 8వ ర్యాంక్, వి.నాగసిద్ధార్థ 13, పి. సాక్షి 40, ఏ.అనుశ్రీ 47, బి.సాయి 68, యాదభరణి శంకర్ 90వ ర్యాంక్ సాధించి ఎస్ఆర్ కీర్తి ప్రతిష్టను జాతీయ స్థాయిలో నిలబెట్టారని ప్రశంసించారు.
ఓపెన్ అన్ని కేటగిరీలు కలిపి జాతీయ స్థాయిలో వరుసగా 8,13, 40, 47, 68, 90,106,115,123, 204, 265, 269, 279, 376, 389, 395, 438, 452, 464, 465, 506, 555, 566, 570, 594, 633, 662, 698, 772, 784, 839, 886 ర్యాంకులు సాధించారని వివరించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు వరదారెడ్డి, మధుకర్ రెడ్డి, సంతోశ్ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని అత్యుత్తమైన ర్యాంకులు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు.