బయో ఈస్తెటిక్స్ ఇంటిగ్రేటెడ్..అగ్రిబయోటెక్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం

బయో ఈస్తెటిక్స్ ఇంటిగ్రేటెడ్..అగ్రిబయోటెక్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం
  • రూ. 30 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు

హైదరాబాద్, వెలుగు: నగర శివార్లలోని సుల్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐసీలో 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన బయో ఈస్తెటిక్స్, ఇంటిగ్రేటెడ్ అగ్రిబయోటెక్ సెంటర్ ఆదివారం ప్రారంభమైంది. రూ.30 కోట్ల పెట్టుబడితో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆర్​&డీ, ఉత్పత్తి, సర్వీసులు ఉంటాయి. ఈ సదుపాయంలో పరిశోధనలను నిర్వహించడమే కాకుండా పంటలకు అవసరమైన సలహాలను సూచనలను కూడా ఇస్తామని బయో ఈస్తెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కేఆర్​కే రెడ్డి  అన్నారు. 

రైతులు తమ పంటభూమి లక్షణాలను అర్థం చేసుకోవడానికి ‘మై అగ్రిబయోమ్​’ అనే అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్​ను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ కేంద్రం వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు,  నిపుణులు కలిసి సహకరించడానికి వేదికగా ఉంటుంది.