పగిలిన శ్రీపాద ఎల్లంపల్లి మెయిన్పైప్లైన్

పగిలిన శ్రీపాద ఎల్లంపల్లి మెయిన్పైప్లైన్

తిమ్మాపూర్​(మానకొండూర్​), వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్​ నుంచి హైదరాబాద్ కు వెళ్లే మెయిన్  పైప్​లైన్  పగిలిపోవడంతో నీళ్లు భారీగా ఎగిసిపడ్డాయి. కరీంనగర్  జిల్లా మానకొండూర్​ మండలం జగ్గయ్యపల్లి శివారులో శుక్రవారం ఉదయం పైప్​లైన్​ పగిలి నీళ్లు ఎగిసిపడడంతో ఆ ప్రాంతమంతా భారీ వాటర్  ఫౌంటేన్​ను తలపించింది. 

విద్యుత్​ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్​ సరఫరాను నిలిపివేశారు. మెయిన్​ పైప్ లైన్  పగలడంతో మరో మూడు లైన్లకు నీటి సప్లై నిలిపివేసినట్లు ఇరిగేషన్​ అధికారులు తెలిపారు. రిపేర్లు చేసి నీటి సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు