ఎన్టీపీసీలో సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

ఎన్టీపీసీలో సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ
  •     హాజరైన చిన్నజీయర్​స్వామి 

జ్యోతినగర్,వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండం బల్దియా పరిధిలోని ఎన్టీపీసీ భీమునిపట్నం చిలుకలయ్య గుడి  ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన శ్రీసీతారామాంజనేయ చంద్రమౌళేశ్వర దేవాలయంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ బుధవారం నిర్వహించారు. ఈ వేడుకకు త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి హాజరయ్యారు. ముందుగా యజ్ఞం నిర్వహించి విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు.

చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ సనాతన ధర్మంలో విగ్రహం చాలా ముఖ్యమైనదని, అందుకే ప్రాణ ప్రతిష్ఠ చేస్తారన్నారు. అనంతరం భక్తులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చేప్యాల శ్రీరామరావు, కేశవరావు, శరత్ రావు, సత్యనారాయణరావు, శ్రీపతిరావు తదితరులు పాల్గొన్నారు.