బాసెల్: ఇండియా స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్.. స్విస్ ఓపెన్లో సెమీస్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో శ్రీకాంత్ 21–10, 21–14తో చాయో హో లీ (చైనీస్తైపీ)పై గెలిచాడు. 35 నిమిషాల మ్యాచ్లో ఇండియన్ ప్లేయర్ ర్యాలీలు, స్మాష్లతో ఆకట్టుకున్నాడు. కీలక టైమ్లో అద్భుతమైన డ్రాప్స్ వేస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. విమెన్స్ డబుల్స్ క్వార్టర్స్లో ట్రీసా జోలీ–గాయత్రి గోపీచంద్ 14–21, 15–21తో సెటానా ఎంపసా–అంజెలా యూ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడారు.
ఆరంభం నుంచే పదునైన షాట్లు కొట్టలేకపోయిన ఇండియన్ జోడీ ఏ దశలోనూ ప్రత్యర్థుల స్కోరును సమం చేయలేకపోయారు. ఇక విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో పీవీ సింధు 21–16, 19–21, 16–21తో టొమోకా మియజాకి (జపాన్) చేతిలో ఓడింది. మెన్స్ సింగిల్స్లో లక్ష్యసేన్ 17–21, 15–21తో చాయో హో లీ (చైనీస్తైపీ) చేతిలో ఓడింది.