AP News: కేజీవీబీ స్కూల్లో ఫుడ్ పాయిజన్.. విద్యార్థులను ఆస్పత్రికి తరలింపు

AP News: కేజీవీబీ స్కూల్లో ఫుడ్ పాయిజన్.. విద్యార్థులను ఆస్పత్రికి తరలింపు

శ్రీ సత్యసాయి జిల్లా..  సోమందేపల్లి కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది.  దీంతో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.  గురువారం( జులై3) నుంచి జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు ఈరోజు ( జులై 4) ఉదయం  విరోచనాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పాఠశాలలోని కొంతమంది విద్యార్థులు మాత్రమే అస్వస్థతకు గురయ్యారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.  ఈ ఘటనకు  ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బుధవారం ( జులై2) రాత్రి సాంబార్​ అన్నం తిన్నామని అప్పటినుంచి అస్వస్థతకు గురయ్యామని విద్యార్థులు చెబుతున్నారు. శాంపిల్స్​ ను ల్యాబ్​కు పంపామని ... ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.