ఏడోసారి ఎక్స్​టెన్షన్​ కోసం స్టేట్​ గవర్నమెంట్​​ ప్రతిపాదన

ఏడోసారి ఎక్స్​టెన్షన్​ కోసం స్టేట్​ గవర్నమెంట్​​ ప్రతిపాదన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి కాలరీస్​ కంపెనీ సీఎండీగా శ్రీధర్​కు మరోసారి ఎక్స్​టెన్షన్​ ఇవ్వాలని కోరుతూ స్టేట్ ​గవర్నమెంట్​ కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. 2015లో శ్రీధర్​ సింగరేణి కంపెనీ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. సీఎండీగా రెండేండ్ల పాటు శ్రీధర్​ ఈ పదవిలో కొనసాగిన తర్వాత ఏడాదికోసారి ఎక్స్​టెన్షన్​ కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి, కోల్​ మినిస్ట్రీకి ప్రతిపాదనలు పంపుతూ వస్తోంది. ఈ ఏడాది 31తో సీఎండీగా ఎనిమిదేండ్లు పూర్తి కావొస్తుండడంతో మరోసారి ఎక్స్​ టెన్షన్​కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్టుగా కంపెనీలో చర్చ సాగుతోంది. ఎక్స్​టెన్షన్​పై రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ పలు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. శ్రీధర్​ఎక్స్​టెన్షన్ అక్రమమంటూ సింగరేణి కోల్​ మైన్స్​కార్మిక సంఘ్ ​రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య ఇప్పటికే హైకోర్టులో పిల్​ వేశారు.