పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలి :  డాక్టర్ అయేషా మస్రత్ ఖానం

పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలి :  డాక్టర్ అయేషా మస్రత్ ఖానం
  • రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ అయేషా మస్రత్ ఖానం

నిర్మల్, వెలుగు: పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ అయేషా మస్రత్ ఖానం సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో కలెక్టర్ అభిలాష అభినవ్, అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్ తో వైద్యారోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. నిర్మల్​జిల్లాలో ఆరోగ్య వ్యవస్థను మెరుగుపర్చాలని చెప్పారు.

నూతన ఆరోగ్య కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందిస్తోందని తెలిపారు. ఆరోగ్య సమస్యలున్న ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు.