కేసీఆర్​ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి

కేసీఆర్​ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి
  • అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం
  • మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి 

నిజామాబాద్,  వెలుగు: ఎనిమిదేండ్ల వయస్సున తెలంగాణ యావత్ దేశానికి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి చెప్పారు. శనివారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా  నిజామాబాద్​లోని కొత్త కలెక్టరేట్​లో  మంత్రి జాతీయ జెండా ఎగుర వేశారు.  ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్​ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో 65 ఏండ్లపాటు పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రస్తుతం కేసీఆర్​ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నట్లు చెప్పారు. ఆయిల్ పామ్​సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. దళితబంధు స్కీమ్​లో మొదటి విడతలో ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాల  చొప్పున  జిల్లాలో 550 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి ప్రకటించారు.