
- చీఫ్ గెస్టులుగా హాజరు కానున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు వంశీకృష్ణ, నగేశ్
నిర్మల్, వెలుగు: ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు నిర్మల్ కొండాపూర్లోని స్పోర్ట్స్ అకాడమీలో రాష్ట్రస్థాయి జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించనున్నట్టు మంచిర్యాల డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గాజుల ముఖేశ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్ తెలిపారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో అండర్ 19 బాలురు, బాలికలకు సింగిల్స్, డబుల్స్, మిక్స్ డబుల్స్ విభాగాల్లో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 17న క్వాలిఫైయింగ్ పోటీలు, 18 నుంచి 20 వరకు మెయిన్ డ్రా పోటీలు ఉంటాయన్నారు.
18 ఉదయం 10 గంటలకు పోటీలను రాష్ట్ర కార్మిక, మైనింగ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితోపాటు ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, గొడం నగేశ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు హాజరుకానున్నట్లు చెప్పారు. సమావేశంలో టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ కిశోర్, కోకన్వీనర్ వన్నెల భూమన్న, కోఆర్డినేటర్లు, పెటా సంగం జిల్లా ప్రెసిడెంట్ భూక్య రమేశ్ తదిత రులు పాల్గొన్నారు.