
ఆదిలాబాద్టౌన్, వెలుగు : రాష్ట్ర స్థాయి బాలుర సబ్ జూనియర్ హాకీ పోటీలు సోమవారం ఆదిలాబాద్లో ప్రారంభం అయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన పోటీలను హాకీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి భీంసింగ్ ప్రారంభించారు. పోటీల్లో ఎనిమిది జిల్లాల టీమ్స్ పాల్గొంటుండగా మొదటి రోజున మెదక్, రంగారెడ్డి టీమ్స్పై ఆదిలాబాద్ విజయం సాధించింది.
ఆదిలాబాద్ జట్టు మంగళవారం హైదరాబాద్తో తలపడనుంది. కార్యక్రమంలో హాకీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోరెడ్డి పార్థసారథి, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్రెడ్డి పాల్గొన్నారు.