సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రికి ఎంపీడీవోల వినతి

సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రికి ఎంపీడీవోల వినతి

హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర ఎంపీడీవోల‌ సంఘం నేతలు శ‌నివారం పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మినిష్ట‌ర్స్ క్యాంపు కార్యాల‌యంలో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఎంపిడీఓలకు డీసీఈవోలుగా ప‌దోన్న‌తులు కల్పించాలని మంత్రిని కోరారు. అలాగే ఎంపీడీవోలకు సంబంధించి డిప్యూటేష‌న్లు, బ‌దిలీలు, సెల‌వుల వినియోగంపై మంత్రితో చర్చించారు. ఉపాధి హామీ ప‌థ‌కం అమ‌లులో ఎదురవుతున్న సమస్యలపై మంత్రికి విన‌తి ప‌త్రం అంద‌చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవోల సమస్యలను ప‌రిశీలించి.. వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తల కోసం...

శ్రీలంకలో పర్యటించనున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు

అంబులెన్స్ లేక... మృతదేహాన్ని మోసుకెళ్లిన వృద్ధుడు