శ్రీలంకలో పర్యటించనున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు

 శ్రీలంకలో పర్యటించనున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు

చెన్నై: శ్రీలంకలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై. శ్రీలంకలోని తమిళ నేతలు, ఎన్ జీవోలతో సమావేశం కానున్నారు. సిలోన్ వర్కర్స్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న మేడే వేడుకల్లో పాల్గొననున్నారు. పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన తర్వాత హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు నివేదిక సమర్పించనున్నారు.  శ్రీలంకకు రూ.123 కోట్ల విలువైన సాయాన్ని పంపేందుకు అనుమతి కోరుతూ తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మరోవైపు తమిళనాడులోని బీజేపీ ఎమ్మెల్యేలు నెల జీతాన్ని సాయంగా ప్రకటించారు.

 

 

ఇవి కూడా చదవండి

సిజేరియన్ డెలివరీలకు ముహూర్తాలు పెట్టొద్దు

హీరోయిన్ జాక్వెలిన్‌ ఆస్తులు సీజ్‌ చేసిన ఈడీ

చెన్నూరులో బీజేపీ నాయకులపై దాడి

సొంత పార్టీ మేయర్ పై తిరగబడ్డ టీఆర్ఎస్ కార్పొరేటర్