
- ఆమోదించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. నర్సాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున రాజ్యాంగపరమైన పదవి నుంచి తప్పుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేతుల మీదుగా ప్రగతి భవన్లో బుధవారం బీ-ఫారం అందుకున్న తర్వాత ఆమె ఆ పదవికి రాజీనామా చేశారు.
రాజీనామాను ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. రెండున్నరేళ్ళకు పైగా ఆమె కమిషన్ చైర్పర్సన్గా వ్యవహరించారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే కొత్త చైర్పర్సన్ నియమితులు కానున్నారు.