ధర్మసాగర్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని, పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసానిస్తుందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం ధర్మసాగర్ మండలం నారాయణగిరికి చెందిన చుంచు సతీశ్కు రూ.3.50 లక్షలు, చుంచు శ్రీలతకు రూ.2.50 లక్షల విలువైన ఎల్వోసీ చెక్కులు మంజూరు కాగా, ఎమ్మెల్యే హనుమకొండ నివాసంలో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పుట్ట రేణుక కుమార్, సీనియర్ నాయకులు రామ్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
