పెండింగ్ ​బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి : నర్సింలు యాదవ్​

పెండింగ్ ​బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి : నర్సింలు యాదవ్​
  •     ప్రొఫెసర్​ కొదండరాంతో జిల్లా సర్పంచులు

భిక్కనూరు, వెలుగు: గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనుల తాలుకు పెండింగ్​ బిల్లులు చెల్లించే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నర్సింలు యాదవ్​ప్రొఫెసర్ ​కోదండరాంను కోరారు. బుధవారం హైదరాబాద్​లోని సోమాజీగూడలో రాష్ట్ర స్థాయి సర్పంచుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా సర్పంచులు తరలివెళ్లారు. సర్పంచ్​ల ఫోరం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్​ మెంబర్ ​తునికి వేణు, మండలాధ్యక్షుడు చిట్టెడి మధుమోహన్​రెడ్డి, ఉపాధ్యక్షుడు గుడిసె రాములు ఉన్నారు.