
న్యూఢిల్లీ: లడఖ్ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడి చేస్తున్నదని కాంగ్రెస్ లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. గత వారం లేహ్లో జరిగిన హింసాకాండ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ అల్లర్లలో భాగంగా చోటు చేసుకున్న కాల్పుల్లో నలుగురు చనిపోగా, అనేక మంది గాయపడ్డారు. ఈ హింసలో పాల్గొన్నారనే ఆరోపణ లతో ఇప్పటి వరకు యాభై మందిని అదుపులోకి తీసుకున్నారు.
లడఖ్ కు రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న యాక్టివిస్టు సోనమ్ వాంగ్ చుక్ ను నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్టు చేసి రాజస్తాన్లోని జోధ్పూర్ జైలులో ఉంచారు. దీంతో రాహుల్ గాంధీ ఆదివారం ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు.