పిల్లలకు సెల్యూట్… దొరికిన జెండాను గుడారంపైన కట్టారు

పిల్లలకు సెల్యూట్… దొరికిన జెండాను గుడారంపైన కట్టారు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ప్రాంతం.. రోడ్డు పక్కనే కొందరు గుడిసెలు వేసుకుని ఉంటున్నరు.. వాటిలో ఓ గుడిసెపై పిల్లలు మువ్వన్నెల జెండాను ఎగరేసి ఇలా మురిసిపోయారు. పేదోళ్లమైనా.. దేశభక్తికి కొదవ లేదని చాటి చెప్పాయి ఆ పసి మనసులు.

జెండా పండుగ నాడు పొద్దున్నే తయారై బడికిపోవడం.. జెండా వందనం చేయడం.. స్కూల్ లో ఇచ్చిన స్వీట్స్ తీసుకుని ఇంటికి రావడం బడిఈడు పిల్లలకు అందరికీ అనుభవమే. కానీ.. సంచార జీవుల పిల్లలు.. ఈ వీధిబాలలు.. బడికి పోవడం లేదు. కానీ.. తెలివిగలవాళ్లు అనిపించుకున్నారు. జెండాలు ప్రదర్శించి.. నినాదాలు చేసి..గల్లీగల్లీ తిరుగుతూ బైక్ ర్యాలీలు చేసిన వాళ్లు..  ఆ తర్వాత వాటిని అక్కడే ఓ చోట వదిలేసి వెళ్లిపోయారట. అలా వారికి దొరికిన జెండాను తీసుకొచ్చి… ఇలా తమ గుడారం పైన కట్టుకున్నారు. సెల్యూట్ చేశారు. జెండాపై వారి మమకారం చూసేవారందరిలో ముచ్చట కలిగించింది. అక్కడే ఉన్న వెలుగు ఫొటోగ్రాఫర్ ఈ సీన్ ను క్లిక్ మనిపించారు.