స్ట్రీట్ ​లైట్లు వెలగట్లే.. బల్దియా పట్టించుకోవట్లే!

స్ట్రీట్  ​లైట్లు వెలగట్లే.. బల్దియా పట్టించుకోవట్లే!
  • స్ర్టీట్ ​లైట్లు వెలగట్లే.. బల్దియా పట్టించుకోవట్లే!
  • గ్రేటర్‌లో మెయిన్, కాలనీ రోడ్లపైనా ఇదే పరిస్థితి
  • మెయింటెనెన్స్ పై బల్దియా అధికారుల నిర్లక్ష్యం
  • రాత్రిపూట రోడ్లపై గుంతల్లో పడుతున్న వాహనదారులు
  • చోరీలు జరిగినా లైటింగ్ లేక సీసీ కెమెరాలకు చిక్కట్లే
  • ప్రతి ఏటా కోట్లలో ఖర్చు చేస్తున్నా మారని తీరు


“ఉప్పల్​కు చెందిన ప్రశాంత్​  హైటెక్​సిటీలోని ఓ కంపెనీలో ఎంప్లాయ్. రెండురోజుల కిందట ఆఫీసులో లేటు అవడంతో అర్ధరాత్రి 12 గంటలకు బైక్​పై ఇంటికి వెళ్తున్నాడు. బంజారాహిల్స్​రోడ్​ నంబర్​.12లో నిర్మాణంలో ఉన్న పోలీసు కమాండ్​ కంట్రోల్​ సెంటర్ ​వద్ద రోడ్డుపై కిలోమీటరు​ మేర స్ట్రీట్​లైట్లు వెలగడం లేదు. రోడ్డుపై చీకటిగా ఉండగా ఓ చోట మ్యాన్​హోల్​ రిపేర్​ చేయగా కనిపించలేదు. అతడు దాన్ని తప్పించబోయి బైక్​ అదుపు తప్పి కిందపడడంతో స్వల్పంగా గాయపడ్డాడు.’’ 

హైదరాబాద్​, వెలుగు: సిటీలో స్ట్రీట్ లైట్లు, హై మాస్ట్​ లైట్లు​మెయిన్​రోడ్లు, కాలనీలు, బస్తీల్లో ఇలా ఏ చోటా చాలా వరకు వెలగడం లేదు. సాయంత్రం ఆరుదాటితే ఆయా ప్రాంతాల్లో చీకటిగా ఉంటుంది. ప్రధాన జంక్షన్ల లోని హైమాస్ట్ లైట్లు కొన్ని నెలలుగా పని చేయడంలేదు.  గ్రేటర్​లో 2 నుంచి5 శాతం స్ట్రీట్​లైట్లు మాత్రమే పని చేయడం లేదని అధికారులు చెబుతుండగా, పరిశీలిస్తే 30 శాతం వరకు లైట్లు వెలగడం లేదని తెలుస్తోంది.  పర్యాటక ప్రాంతాలైన ట్యాంక్​బండ్​, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి తదితర ఏరియాలపైనే ఫోకస్​చేస్తున్న  అధికారులు పబ్లిక్ తిరిగే ప్రాంతాలను పట్టించుకోవడంలేదు. స్ర్టీట్​లైట్లు వెలగక చాలా చోట్ల యాక్సిడెంట్​లు కూడా అవుతున్నాయి.  కాలనీలు, బస్తీల్లో వీధిలైట్లు లేని ప్రాంతాలనే దొంగలు టార్గెట్​గా పెట్టుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో చోరీ జరిగితే ఆ చిత్రాలు  సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించడం లేదు. గ్రేటర్​లో కొంతకాలం కిందట రూ.217.12 కోట్లతో ఎల్ఈడీ లైట్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి వీటిని  టెక్నికల్​గా పర్యవేక్షిస్తున్న అధికారులు 98 శాతం వెలుగుతున్నాయని చెబుతున్నా ఆ పరిస్థితి కనబడడంలేదు. 

రాత్రిపూట యాక్సిడెంట్లు 
మియాపూర్​, బాగ్​లింగంపల్లి,  సుచిత్ర, అబిడ్స్, సికింద్రాబాద్​, మెహిదీపట్నం, నాగోల్, నానల్​నగర్, రేతిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గోల్కొండ, మల్లేపల్లి, నాంపల్లి​ ఇలా ప్రాంతాల్లోని మెయిన్​రోడ్లు, కాలనీల్లో స్ర్టీట్​లైట్లు సరిగా లేక, ఉన్నా వెలగకపోతుండగా స్థానికులు రాత్రిపూట ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. టొలీచౌకి నుంచి జూబ్లీహిల్స్​వెళ్లే రూట్​లో లైటింగ్​లేకపోవడంతో పాటు రోడ్లు గుంతలుగా ఉండడం తో రాత్రిపూట యాక్సిండెంట్లు కూడా అవుతున్నాయి. ఎక్కడ చూసినా  పరిస్థితి ఇలాగే ఉంటున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు.