న్యూఢిల్లీ: లోక్ సభలో డాక్టర్ల కోస మాట్లాడారు ఎంపీ హేమమాలిని. డాక్లర్లపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కఠినమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కొంతమంది ముష్కరమూక నుంచి డాక్లరు ఎదుర్కొంటున్న వేధింపులకు ముగింపు పలకాల్సిన అవసరముందని, దీనికోసం కఠినమైన చట్టం తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు.
తన సొంత నియోజకవర్గమైన మధురలో ఇటీవలే జరిగిన దాడులను ఈ సందర్భంగా హేమమాలిని ప్రస్తావించారు. పశ్చిమబెంగాల్ లో డాక్టర్లపై జరిగిన దాడులకు నిరసనగా దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. డాక్లరు దేవుడి లాంటి వారని..కొన్ని సార్లు 48 గంటలపాటు కూడా పనిచేస్తుంటారని చెప్పారు హేమమాలిని.
Hema Malini: They're our superhero&national asset. We trust God&place equal trust on doctors. There should be a very strict law to protect medical community. Govt should make rules to blacklist those who assault doctors, they should be debarred from facilities,including hospitals https://t.co/vZ9sf0cnPI
— ANI (@ANI) July 4, 2019