నాలుగో రోజుకి చేరిన కార్మికుల సమ్మె.. పర్మినెంట్​ చేయాలని డిమాండ్​

నాలుగో రోజుకి చేరిన కార్మికుల సమ్మె.. పర్మినెంట్​ చేయాలని డిమాండ్​

జీహెచ్​ఎంసీ  ఔట్ సోర్సింగ్​ కార్మికులు తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్​ చేస్తూ చేపట్టిన సమ్మె నేటితో నాలుగో రోజుకి చేరింది. వారికి ఎంప్లాయ్స్​ యూనియన్​ ప్రెసిడెంట్​ఉదరి గోపాల్​ సంఘీభావం ప్రకటించారు. అనంతరం సరూర్​నగర్​ జీహెచ్​ఎంసీ కార్యాలయం ముందు కార్మికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.  

ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్లే ఔట్​సోర్సింగ్​ఉద్యోగులను కూడా రెగ్యులరైజ్​ చేయాలని డిమాండ్​ చేశారు. కార్మికులు విధుల్ని బహిష్కరిస్తే హైదరాబాద్​ చెత్త కుప్పగా మారుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

సీఎం కేసీఆర్​ జీహెచ్​ఎంసీ కార్మికులకు ఇచ్చిన మాట తప్పారని సమ్మె చేస్తున్న కార్మికులను బీఆర్​ఎస్​ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నిరుపేదలపై సీఎం కక్ష సాధింపు ధోరణి సరకాదని అన్నారు. వారిని పర్మినెంట్​ చేస్తున్నామని కేసీఆర్​ బహిరంగంగా ప్రకటించే వరకు ఉద్యమాన్ని ఆపబోయేదని లేదని స్పష్టం చేశారు.