
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఈ నెల12 నుంచి అన్ని బస్ పాస్ కేంద్రాల్లో స్టూడెంట్పాస్లు జారీ చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఎప్పటి లాగే అడ్మినిస్ట్రేటివ్ చార్జీలను చెల్లించాలని, ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థలకు అవసరం లేదని స్పష్టం చేశారు. అడ్మినిస్ట్రేటివ్ ఫీజు చెల్లించిన ఇన్స్టిట్యూషన్స్కు మాత్రమే పాస్లు జారీ చేస్తామన్నారు. స్టూడెంట్స్పాస్ ను టీజీఎస్ఆర్టీసీ వెబ్ సైట్ https://tgsrtcpass.com ద్వారా దరఖాస్తు చేసుకుని, తమ విద్యాసంస్థ నుంచి ఆన్ లైన్ లో ఫార్వర్డ్ చేయించుకొని, దరఖాస్తు ఫారంపై ప్రిన్సిపాల్ సంతకం, ప్రిన్సిపాల్ సీల్ వేయించుకొని, ఎంచుకున్న కేంద్రంలో పాస్ పొందవచ్చన్నారు.
అరాంఘర్, అఫ్టల్ గంజ్, బాలానగర్, బోరబండ, సీబీఎస్, చార్మినార్, దిల్ సుఖ్ నగర్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్, ఫారుఖ్ నగర్, ఘట్ కేసర్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, జేబీఎస్, కాచిగూడ, కోఠి టెర్మినల్, కేపీహెచ్ బీ, కూకట్ పల్లి బస్స్టేషన్, లక్డీకాపూల్, ఎల్బీనగర్, లింగంపల్లి, లోతుకుంట, మేడ్చల్, మెహదీపట్నం, మిధాని, మొయినాబాద్, ఎన్జీవో కాలనీ, పటాన్ చెరు, రేతిఫైల్-సికింద్రాబాద్, ఆర్జీఐ ఎయిర్ పోర్ట్, సనత్ నగర్, సెక్రటేరియట్, శంషాబాద్, ఎస్ఆర్ నగర్, షాపూర్ నగర్, సుచిత్ర, తార్నాక, ఉప్పల్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, కోఠి ఉమెన్స్ కాలేజీ- కేంద్రాల నుంచి పాస్లు పొందవచ్చన్నారు.