మొత్తంగా 2, 21, 488 మంది దరఖాస్తు
హైదరాబాద్, వెలుగు: జులై 6 నుంచి ప్రారంభం కానున్న టీఎస్ఎంసెట్ ఎగ్జామ్ కు 20 వేలకు పైగా మంది స్టూడెంట్లు సెంటర్లను మార్చుకున్నారు. వీరిలో తెలంగాణ నుంచి తెలంగాణలోనే 6,093 మంది ఉండగా, తెలంగాణ నుంచి ఏపీకి 3 వేల మంది, ఏపీలోనే వేరే కేంద్రాల్లో రాసేందుకు మరో 11 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో హైదరాబాద్లోని ఐదు జోన్ల మధ్యలోనే ఎక్కువగా సెంటర్లు మార్చుకున్నారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ సారి స్టూడెంట్లకు సెంటర్లు మార్చుకునే అవకాశం ఇచ్చారు. ఈ ఏడాది ఎంసెట్ కు మొత్తం 2,21,488 మంది అప్లయ్ చేసుకున్నారు. ఓ వైపు కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో అసలు ఎంసెట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారో లేదో అని స్టూడెంట్లలో ఆందోళన మొదలైంది.
For More News..