- తమ కొడుకును తోటి విద్యార్థులు వేధిస్తున్నారని పేరెంట్స్ ఆందోళన
- వాటర్ బాటిల్లో మూత్రం పోస్తున్నారని, బాత్రూంకు వెళ్తే రాళ్లు వేస్తున్నట్లు ఆరోపణ
కాగజ్నగర్, వెలుగు: కాగజ్ నగర్ పట్టణం లోని చెక్ పోస్ట్ సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతి బాఫూలే రెసిడెన్షియల్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న తమ కొడుకును తోటి స్టూడెంట్స్ వేధిస్తున్నారని పేరెంట్స్ ఆందోళనకు దిగారు. కాగజ్ నగర్ పట్టణం బాలాజీ నగర్కు చెందిన బాలుడిని 15 రోజుల క్రితం జ్యోతి బాఫూలే హాస్టల్లో ఏడో తరగతిలో చేర్చారు. అప్పటి నుంచి తమ కొడుకును తోటి విద్యార్థులు టార్గెట్ చేసి వేధిస్తున్నారని తల్లిదండ్రులు వాపోయారు.
శనివారం స్టూడెంట్స్ ఔటింగ్కు వెళ్లి తల్లికి విషయం చెప్పి ఏడ్చాడు. బాలుడి నీళ్ల బ్యాటిల్లో మూత్రం పోశారని, అది తెలియక మంచినీళ్లు అనుకొని తాగడంతో ఇన్ఫెక్షన్ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాత్ రూమ్కు వెళ్లిన సమయంలో రాళ్లు విసరడంతో తృటిలో తప్పించుకున్నాడని పేర్కొన్నారు. రూములో పడుకునేందుకు తోటి విద్యార్థులు ఇబ్బందులు పెట్టడంతో వరండాలో పడుకున్నట్లు కొడుకు చెప్పాడని తల్లి వాపోయింది. ఈ విషయమై ప్రిన్సిపాల్ జయశ్రీని సంప్రదించగా సదరు స్టూడెంట్కు చదువుపై ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఏదో ఒక సమస్య చెబుతున్నాడని, కౌన్సెలింగ్ ఇచ్చినా మారడం లేదన్నారు.
