జేఎన్టీయూ హాస్టల్లో పురుగుల అన్నం

జేఎన్టీయూ హాస్టల్లో పురుగుల అన్నం

కూకట్​పల్లి, వెలుగు: జేఎన్​టీయూలోని మంజీర హాస్టల్​ లో అపరిశుభ్ర భోజనం పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై గతంలో హాస్టల్​ నిర్వాహకులకు, వర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు చెబుతున్నారు. సోమవారం రాత్రి డిన్నర్​లో స్టూడెంట్స్​కు వడ్డించిన అన్నంలో పురుగులు వచ్చాయి. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వారు  ఆరోపించారు.