న్యూస్పేస్ ఇండియా (NSIL) ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ ఇంజినీర్, తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోండి..
పోస్టులు: 47. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 22, ప్రాజెక్ట్ ఇంజినీర్లు 15, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 10.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, బి.టెక్/ బీఈ, డిప్లొమా, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎం.టెక్/ ఎంఈ, ఎం.ఫిల్/ పీహెచ్డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 45 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.250.
లాస్ట్ డేట్: నవంబర్ 30.
సెలెక్షన్ ప్రాసెస్: ఎన్ఎస్ఐఎల్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ముందస్తుగా నమోదు చేసుకున్న అభ్యర్థులకు వాక్- ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు nsilindia.co.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
