![మల్లారెడ్డి వర్సిటీ వివరణ ఇవ్వాలి](https://static.v6velugu.com/uploads/2024/02/students-and-leaders-of-nsui-student-unions-alleged-that-students-are-facing-serious-problems-with-mallareddy-university-management_wXYg3oOkGt.jpg)
- విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతల ఆందోళన
జీడిమెట్ల, వెలుగు : మల్లారెడ్డి యూనివర్సిటీ మేనేజ్ మెంట్ తో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులు, ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. ఇటీవల కాలేజీ విద్యార్థికి ప్లేస్మెంట్ రాలేదని ఆత్మహత్య చేసుకోవడం, హాస్టల్ ఫుడ్ లో బొద్దింకలు, బల్లులు రావడంతో శనివారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యంతో విద్యార్థులు తమ జీవితాలను కోల్పోతున్నారన్నారు.
రూల్స్ కు విరుద్ధంగా ఫీజులు వసూలు చేయడంతోపాటు సరైన విద్య, భోజన వసతి కల్పించడం లేదని ఆరోపించారు. దీనిపై మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్రెడ్డి వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. సోమవారం చర్యలు తీసుకునేందుకు మేనేజ్ మెంట్ అంగీకరించడంతో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన విరమించారు.