పురుగుల అన్నం పెడుతున్నరని.. భోజనం ప్లేట్లతో విద్యార్థుల ధర్నా

పురుగుల అన్నం పెడుతున్నరని..  భోజనం ప్లేట్లతో విద్యార్థుల ధర్నా

హాలియా, వెలుగు:  నల్గొండ జిల్లా హాలియాలోని జిల్లా పరిషత్ హైస్కూల్​లో పురుగులన్నం పెడుతున్నారని విద్యార్థులు గురువారం మధ్యాహ్నం హాలియా తహసీల్దార్​ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. కొద్ది రోజులుగా ఇదే రిపీట్​అవుతుండడంతో భరించలేని విద్యార్థులు అన్నం ప్లేట్లతో తహసీల్దార్​ఆఫీసుకు చేరుకుని నిరసన తెలిపారు. 

ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ వారం రోజులుగా మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని, చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో తాము అన్నం తినడం లేదన్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణారెడ్డి విద్యార్థులు వద్దకు చేరుకుని వివరాలడిగి తెలుసుకున్నారు. 

స్కూల్​కు వెళ్లి మధ్యాహ్నం భోజనం వండిన బియ్యాన్ని పరిశీలించగా అందులో పురుగులు కనిపించాయి. దీంతో  ఆ బియ్యాన్ని వండొద్దని వాపస్ ఇవ్వాలని స్కూల్​ఏజెన్సీని ఆదేశించారు.  పాఠశాల ఇన్​చార్జి హెచ్ఎం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బియ్యానికి పురుగులు పట్టిన మాట వాస్తవమేనని, డిప్యూటీ తహసీల్దార్​ ఆదేశాల మేరకు వాటిని తీసుకువెళ్లాలని  చెప్పామన్నారు.