రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలకు విద్యార్థులు

రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలకు విద్యార్థులు

నవీపేట్, వెలుగు : నవీపేట్ మండల కేంద్రానికి చెందిన లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ స్టూడెంట్స్​ ప్రతిభ కపబరిచి రాష్ట్రస్థాయి నెట్​ బాల్​ పోటీలకు ఎంపికయ్యారు. ఎస్జీఎఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి లో శుక్రవారం  జిల్లాస్థాయి నెట్ బాల్ టోర్నమెంట్ అండ్ సెలెక్షన్స్ నిర్వహించారు.

ఈ పోటీల్లో విద్యార్థినులు నిత్యా రెడ్డి, లాస్య ప్రతిభ కనబరచడంతో  రాష్ట్ర స్థాయి నెట్ బాల్ కు ఎంపిక చేసినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు.  విద్యార్థులను కరెస్పాండెంట్ హన్మాండ్లు, పీఈటీ, టీచర్స్, తదితరులు అభినందించారు.