టీచర్​ కోసం కలెక్టరేట్​ ఎదుట స్టూడెంట్స్, స్థానికుల ధర్నా

టీచర్​ కోసం కలెక్టరేట్​ ఎదుట స్టూడెంట్స్, స్థానికుల ధర్నా

కామారెడ్డి టౌన్, వెలుగు : లింగంపేట మండలం భవానిపేట దళితవాడ  ప్రైమరీ స్కూల్​కు అదనంగా టీచర్​ని కేటాయించాలని డిమాండ్​చేస్తూ స్టూడెంట్స్, స్థానికులు కామారెడ్డి కలెక్టరేట్​ఎదుట సోమవారం ధర్నా  చేశారు. 75 మంది స్టూడెంట్స్​ఉంటే ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారని, దీంతో స్టూడెంట్స్​ఇబ్బందులు  పడుతున్నారన్నారు.

ఎస్​ఎమ్​సీ చైర్మన్​ పోచయ్యతో పాటు,  స్టూడెంట్స్, స్థానికులు డీఈవో రాజును కలిసి సమస్యను వివరించారు. మరో స్కూల్​ నుంచి ఒక టీచర్​ని డిప్యూటేషన్​పై పంపిస్తున్నట్లు డీఈవో తెలిపారు.