చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : కామారెడ్డి జిల్లా జడ్జి వరప్రసాద్

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : కామారెడ్డి జిల్లా జడ్జి వరప్రసాద్

కామారెడ్డి, వెలుగు : విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి  జిల్లా జడ్జి వీఆర్ఆర్​ వరప్రసాద్​ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్స్​ స్కూల్​లో  జిల్లా  న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ చైతన్య  సదస్సు నిర్వహించారు.  స్టేట్​లో మొదటి సారిగా  లిటిల్ స్కాలర్స్​ స్కూల్​లో ఏర్పాటు చేసిన స్కూల్​ ఆధారిత రేడియో స్టేషన్​ను జిల్లా జడ్జి పరిశీలించి మాట్లాడారు. వినూత్న ఆవిష్కరణలు విద్యార్థుల ఆత్మ విశ్వాసాన్ని పెంచటంతో పాటు,  సమాచార నైపుణ్యాలు, సృజనాత్మకతను పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు. బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ కోసం చట్టం అందించే అవకాశాలు,  విద్యార్థుల హక్కుల గురించి వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ నాగరాణి, స్కూల్ ​డైరెక్టర్లు పున్న అరుణ, పున్న రాజేశ్,  ప్రిన్సిపాల్ స్వాతిప్రియా,   న్యాయసేవాధికార సంస్థ సూపరింటెండెంట్ చంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.