స్టూడెంట్లు లక్ష్యం పెట్టుకొని చదవాలి

స్టూడెంట్లు లక్ష్యం పెట్టుకొని చదవాలి

సూర్యాపేట, వెలుగు: స్టూడెంట్లు లక్ష్యం పెట్టుకొని చదవాలని ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యాస రాంకుమార్ రెడ్డి సూచించారు. అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుధాకర్ పీవీసీ లిమిటెడ్  సౌజన్యంతో ఆదివారం  జిల్లాలోని సోషల్‌‌ వెల్ఫేర్‌‌‌‌ రెసిడెన్షియల్ విద్యార్థులకు నోట్ బుక్స్ అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులు  అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలన్నారు.  ఈ కార్యక్రమంలో  అక్షర ఫౌండేషన్ అధ్యక్షులు ఉప్పు నాగయ్య,  బత్తుల దామోదర్ రెడ్డి, రుద్రంగి కాళిదాసు,  ప్రిన్సిపాల్స్ శమంతక మణి, చారి, హెచ్‌‌ఎం వెంకటయ్య, కృష్ణయ్య  పాల్గొన్నారు.