బషీర్ బాగ్, వెలుగు : జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై స్టడీ చేస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇచ్చేందుకు కృషి చేస్తామని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూజే- టీడబ్ల్యూజేఎఫ్) టీమ్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించింది. అనంతరం హెచ్యూజే నూతన డైరీని అందించింది. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశంపై హెచ్యూజే బృందంతో చైర్మన్ చర్చించారు. జేఎన్జే ఇష్యూను పరిష్కరిస్తూనే.. ఇతర సొసైటీల్లోని జర్నలిస్టులకు ఏ ప్రాతిపదికన ఇవ్వాలనే దానిపైనా కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు.
సిటీలో పనిచేసే వర్కింగ్జర్నలిస్టులందరికీ ఒకేచోట ఇవ్వడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదని, నగరానికి నలువైపులా స్థలాలు కేటాయించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనిపై పార్లమెంట్ఎన్నికల తర్వాత మరింత ప్రోగ్రెసివ్గా ముందుకెళ్లనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. డిజిటల్మీడియాలో పని చేసేవారి విషయంలో ఎలాంటి ప్రాతిపదికతో ముందుకు వెళ్లాలనే దానిపైన కూడా ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. మీడియా అకాడమీ చైర్మన్ ను కలిసిన వారిలో హెచ్యూజే అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్ కుమార్, జగదీశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్రనవీన్, కోశాధికారి రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్రమేశ్, ఈసీ మెంబర్సుభాశ్ ఉన్నారు.