హైదరాబాద్, వెలుగు: ఇండోనేషియాలో కొత్తగా సబ్సిడరీ పెట్టేందుకు నాట్కో ఫార్మా లిమిటెడ్ బోర్డు ఆమోదం తెలిపింది. ఆ దేశంలో ఫార్మాస్యూటికల్ప్రొడక్ట్స్ అమ్మేందుకు రూ. 25 కోట్లతో ఈ సబ్సిడరీ పెడుతున్నారు. కొత్త సబ్సిడరీకి పీటీ నాట్కో లోటస్ఫార్మా పేరు పెట్టారు. సబ్సిడరీ కంపెనీలో నాట్కోకు 51 శాతం వాటా, పీటీ మిత్ర మెడిస్ ఎగ్జిమ్కి 49 శాతం వాటా ఉంటాయి. ఇండోనేషియాలో పేరొందిన మిత్ర జయ గ్రూప్తో కలిసి జాయింట్ వెంచర్గా సబ్సిడరీ ఏర్పాటు చేస్తున్నట్లు నాట్కో ఫార్మా లిమిటెడ్ వెల్లడించింది.
మొదటిదశలో ఒక మిలియన్ డాలర్లు వెచ్చించనున్నామని, ఆ తర్వాత అవసరమైనప్పుడు మిగిలిన డబ్బు పెట్టుబడిగా పెట్టనున్నామని పేర్కొంది. మిత్ర జయ గ్రూప్ కంపెనీ అయిన మిత్ర మెడిస్ ఎగ్జిమ్ చాలా ఏళ్లుగా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రీడియెంట్స్ (ఏపీఐ) అమ్ముతోంది. గ్రోత్తోపాటు, లాభదాయకత పెంచుకోవడానికి కొత్త దేశాలలో ఎంటరవుతున్నామని నాట్కో ఫార్మా ఈ సందర్భంగా తెలిపింది.