ఇన్ఫోసిస్ 40 వార్షికోత్సవ వేడుకల్లో సూధా మూర్తి డ్యాన్స్

ఇన్ఫోసిస్ 40 వార్షికోత్సవ వేడుకల్లో సూధా మూర్తి డ్యాన్స్

ప్రముఖ విద్యావేత్త, రచయిత్రి,  ఇన్ఫోసిస్‌  ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి  సింగర్, డ్యాన్సర్ అవతారం ఎత్తారు. బాలీవుడ్ సింగర్ శ్రేయా ఘోషల్తో కలిసి  పాట పాడి అందరిని ఉత్సాహ పరిచారు. పాట పాడటమే కాదు..హుషారుగా స్పెప్పులేసి అలరించారు. బెంగుళూరులో ఇన్ఫోసిస్ 40 వార్షికోత్సవ వేడుకల్లో సూధా మూర్తి డ్యాన్స్, పాటతో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు.  ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 

 డైరెక్టర్ మ‌ణిర‌త్నం తెరకెక్కించిన‌  గురు సినిమాలోని "బర్సో రే మేఘా మేఘా" పాటను  సుధామూర్తి ఉత్సాహంగా పాడారు. తనకుఇష్టమైన సాంగ్ కావ‌డంతో సుధా  పాట పాడుతూ సరదాగా కాలు కదిపారు. ప‌క్కన ఉన్న వాళ్లు చప్పట్లు కొడుతూ...ఆమెను ఉత్సాహ‌ప‌రిచారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల  మీడియాలో తెగ షేర్‌ అవుతున్నాయి.