పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి..16మంది సైనికులు మృతి

పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి..16మంది సైనికులు మృతి

వాయువ్య పాకిస్తాన్‌లో తాలిబన్లు జరిపిన ఆత్మాహుతి దాడిలో 16 మంది సైనికులు మృతిచెందారు. 29 మంది గాయపడ్డారు. శనివారం (జూన్28) న ఉత్తర వజీరిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిన వ్యక్తి పేలుడు పదార్థాలు నిండిన వాహనాన్ని పేల్చాడు. ఈ శక్తివంతమైన పేలుడుతో సమీపంలోని ఇళ్లకు కూడా నష్టం ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో గాయపడిన వారిలో పిల్లలు కూడా ఉన్నారు. 

ఓ ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో సైనిక కాన్వాయ్‌పైకి దూసుకెళ్లి తనను తాను పేల్చుకున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.