షిమ్లా : హిమాచల్ప్రదేశ్ 15వ సీఎంగా సుఖ్విందర్సింగ్ సుఖు, డిప్యూటీ సీఎంగా ముకేశ్ అగ్నిహోత్రి ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఇద్దరితో ప్రమాణం చేయించారు. సిమ్లాలోని రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు చత్తీస్గడ్, రాజస్థాన్ సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేశ్ బాఘేల్, మాజీ కేంద్ర మంత్రి ఆనంద్శర్మ, హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా హాజరయ్యారు. అనంతరం హిమాచల్ప్రదేశ్కు 6 సార్లు సీఎంగా సేవలందించిన రాజవంశీకుడు దివగంత వీరభద్ర సింగ్కి లీడర్లంతా నివాళులర్పించారు. వేదికపైనే ఉన్న వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ను రాహుల్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ వేడుకలో సుఖ్విందర్ తల్లి, భార్యతో పాటు కూతుళ్లు హాజరయ్యారు.
ప్రతిభా సింగ్ ఇంటికెళ్లి ఆహ్వానించిన సుఖు
ప్రతిభా సింగ్ ఇంటికెళ్లి ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా సుఖ్విందర్ సింగ్ సుఖు ఆదివారం ఉదయం ఇన్విటేషన్ ఇచ్చారు. ఆమె లీడర్షిప్లోనే ప్రభుత్వం పని చేస్తుందని మీడియాతో సుఖు చెప్పారు. అయితే, అందరికంటే చివరగా ప్రతిభా సింగ్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఆమెకు రాహుల్, ప్రియాంక గాంధీలు ఘనంగా స్వాగతం పలికారు. కాగా, హిమాచల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీ కార్యకర్తల్లో జోష్ వచ్చిందని, త్వరలో 12 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేస్తామని భూపిందర్ సింగ్ హుడా తెలిపారు.
ప్రధాని మోడీ శుభాకాంక్షలు
హిమాచల్ కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన సుఖ్విందర్కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు చెప్పారు. హిమాచల్ అభివృద్ధికి కేంద్రం నుంచి అన్నివిధాలా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఆయన ట్వీట్ చేశారు. టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా కూడా సుఖుకు కంగ్రాట్స్ చెప్పారు. ‘‘ఇండియాతో నాకు 62 ఏండ్ల అనుబంధం ఉంది. హిమాచల్లోని ధర్మశాలలో ఎక్కువ టైం గడిపాను. సుఖు సీఎం కావడం సంతోషంగా ఉంది. హిమాచల్లోని అన్ని వర్గాల ప్రజలు నాతో పాటు ఉన్న టిబెటన్లకు ఆతిథ్యం ఇచ్చారు. ఎప్పటికీ మరిచిపోలేను’’అని దలైలామా గుర్తు చేశారు.
లోయర్ హిమాచల్ నుంచి రెండో సీఎం
అప్పర్ హిమాచల్ప్రదేశ్ నుంచి కాంగ్రెస్ తరఫున వైఎస్ పర్మార్, వీరభద్ర సింగ్, రామ్లాల్ ఠాకూర్ సీఎంగా సేవలందించారు. లోయర్ హిమాచల్ప్రదేశ్ నుంచి సీఎంగా ఎన్నికైన రెండో వ్యక్తిగా సుఖ్విందర్ నిలిచారు.
జర్నలిస్ట్ నుంచి డిప్యూటీ సీఎంగా అగ్నిహోత్రి..
డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ముకేశ్ అగ్నిహోత్రి జర్నలిస్ట్గా పని చేశారు. బ్రాహ్మణ కులానికి చెందిన ఆయన, ఉనా జిల్లా హరోలీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తండ్రి ఓంకార్ శర్మ రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయారు. 1988లో హరోలీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. చివరికి డీపీఆర్వోగా రిటైర్మెంట్ తీసుకున్నారు. వీరభద్ర సింగ్కు సన్నిహితుడు. కాగా, హమీర్పుర్ జిల్లా నదౌన్ నుంచి సుఖ్విందర్ సింగ్ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.