నా బిడ్డ చావుకు వారే కారణం: పోలీస్ స్టేషన్ లో సుమేధ పేరెంట్స్ కంప్లైంట్

నా బిడ్డ చావుకు వారే కారణం: పోలీస్ స్టేషన్ లో సుమేధ పేరెంట్స్ కంప్లైంట్

హైదరాబాద్: 4 రోజుల క్రితం నేరేడ్ మెట్ లో సుమేధ నాలాలో 2 కిలోమీటర్లు కొట్టుకుపోయి మరణించిన విషయం తెలిసిందే. అయితే ఇదే సంఘటనపై నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలువురిపై కేసు నమోదైంది. బాలిక సుమేధ మరణానికి పరోక్షంగా కారణం అయిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, మల్కాజిగిరి ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్, జి.హెచ్.ఎం.సి జోనల్ కమీషనర్, మల్కాజిగిరి డిప్యూటీ కమీషనర్, ఏ.ఈ, డి.ఈ లపై హత్యాకేసు నమోదైంది. ఈ కేసును వెంటనే దర్యాప్తు చేయాలని నేరేడ్ మెట్ పొలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు సుమేధ తల్లిదండ్రులు.