ఏటీపీ చెన్నై చాలెంజర్  టోర్నమెంట్‌‌‌‌లో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌లో సుమిత్

ఏటీపీ చెన్నై చాలెంజర్  టోర్నమెంట్‌‌‌‌లో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌లో సుమిత్

చెన్నై: ఇండియా టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్   ఏటీపీ చెన్నై చాలెంజర్  టోర్నమెంట్‌‌‌‌లో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌ చేరుకున్నాడు. బుధవారం జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌లో రెండో సీడ్ సుమిత్ 7–5, 6–2తో ఇటలీకి చెందిన ఫొనినోపై వరుస సెట్లలో విజయం సాధించాడు.

తొలి సెట్‌‌‌‌లో  ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న ఇండియా స్టార్ రెండో సెట్‌‌‌‌లో అలవోకగా గెలిచాడు. మరోవైపు మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో సాకేత్‌‌‌‌ మైనేని–రామ్‌‌‌‌కుమార్ రామనాథన్ జోడీ  7–6 (7/3), 6–4తో మూడో సీడ్ పియోటర్ మాటుస్జెవ్‌‌‌‌స్కీ (పోలాండ్‌‌‌‌)–రే హో (తైవాస్‌‌‌‌) జంటకు షాకిచ్చి  క్వార్టర్స్‌‌‌‌లో అడుగు పెట్టింది.