పంజాగుట్ట, వెలుగు: వేసవి సెలవుల్లో దేశీయ పర్యటనలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఈ వివరాలను ఐఆర్సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ కిషోర్ గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఉండేలా హైదరాబాద్ నుంచి కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, అండమాన్, హరిద్వార్, రిషికేష్ వంటి ప్రాంతాలకు టూర్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా కాశ్మీర్ 6 రోజుల యాత్రకు (శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గాం, సోన్మార్గ్ సందర్శన) ఒక్కొక్కరికి రూ. 44,600గా ధర నిర్ణయించామన్నారు. పర్యాటకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
