ENG vs IND 2025: టెండూల్కర్ పేరు ముందు పెట్టండి..ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుపై గవాస్కర్ ఫైర్

ENG vs IND 2025: టెండూల్కర్ పేరు ముందు పెట్టండి..ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుపై గవాస్కర్ ఫైర్

ఇండియా, ఇంగ్లండ్‌ మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను సచిన్ టెండూల్కర్‌–జేమ్స్‌ అండర్సన్‌ పేరు మీద నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ‘అండర్సన్‌–టెండూల్కర్‌ ట్రోఫీ’గా దీనికి పేరు పెట్టారు. గతంలో ఇఫ్తికార్‌ అలీఖాన్‌ పటౌడీ, అతని కుమారుడు మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీ పేర్ల మీద ‘పటౌడీ ట్రోఫీ’ కోసం యూకేలో ఇంగ్లండ్‌, ఇండియా మధ్య టెస్ట్‌ మ్యాచ్‌లు నిర్వహించారు. కానీ ఈ ట్రోఫీని విరమించుకుంటున్నట్లు ఈసీబీ మార్చిలో పటౌడీ ఫ్యామిలీకి లేఖ రాసింది. ఆల్‌టైమ్‌ గ్రేట్స్‌లో ఒకరైన సచిన్‌ 15921 రన్స్‌తో టాప్‌లో ఉండగా, అండర్సన్‌ 704 వికెట్లు సాధించాడు. ఈ ఇద్దరికి గుర్తింపుగా ఈ ట్రోఫీకి పేరుపెట్టాలని భావించారు. 

పటౌడీ ట్రోఫీ పేరు మార్చినందుకు టీమిండియా దిగ్గజ క్రికెటర్లు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇంగ్లాండ్ క్రికెటర్ బోర్డు ఎవరి మాట పట్టించుకోకుండా అండర్సన్‌–టెండూల్కర్‌ ట్రోఫీ పేరును ఖరారు చేశారు. అయితే ఈ ట్రోఫీపై భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందులో భాగంగా ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ECB)ను భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విమర్శించారు. కొత్త పేరులో జేమ్స్ ఆండర్సన్ కంటే ముందు సచిన్ టెండూల్కర్ పేరు ఉండాల్సిందని గవాస్కర్ వాదించారు. 

ALSO READ | ENG vs IND 2025: రెండు సెంచరీలు కొట్టినా తప్పని శిక్ష: పంత్‌ను మందలించిన ఐసీసీ.. కారణమిదే!

"ట్రోఫీకి ఆండర్సన్ పేరు మొదట రావడం ఆశ్చర్యకరం. ఆండర్సన్ కంటే సచిన్ టెండూల్కర్ చాలా సీనియర్ కూడా. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో మూడవ స్థానంలో ఉన్న జేమ్స్ ఆండర్సన్ కంటే సచిన్ రికార్డ్స్ చాలా గొప్పవని గవాస్కర్ నొక్కిచెప్పారు. ఆండర్సన్ సొంతగడ్డపై మాత్రమే బాగా రాణించాడని.. టెండూల్కర్ ప్రపంచవ్యాప్తంగా గొప్ప రికార్డ్స్ ఉన్నాయి. సిరీస్ గెలిచిన జట్టు కెప్టెన్‌కు పతకం ఇవ్వడం ద్వారా పటౌడీలకు గౌరవం ఇస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. సిరీస్ డ్రా అయితే ఏమి చేయాలి?". అని గవాస్కర్ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Cricketangon (@cricketangon)