- ప్లేఆఫ్స్ రేసులో బెంగళూరుకు కీలక పోరు
- రా. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో లైవ్
హైదరాబాద్, వెలుగు: సొంతగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఆఖరాటకు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కీలక పోరుకు రెడీ అయ్యాయి. గురువారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో ఇరు జట్లూ పోటీ పడున్నాయి. చెత్తాటతో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన సన్ రైజర్స్ ఇందులో గెలిచి పరువైనా దక్కించుకోవాలని చూస్తోంది. 12 పాయింట్లతో ఐదో ప్లేస్లో ఉన్న్ ఆర్సీబీకి ఈ మ్యాచ్లో విజయం కీలకం కానుంది.
తమ చివరి రెండు మ్యాచ్ల్లోనూ గెలవాల్సిన పరిస్థితిలో ఉన్న బెంగళూరు.. సన్రైజర్స్పై భారీ విజయం సాధించాలని చూస్తోంది. ఈ పోరులో అందరి కండ్లూ విరాట్ కోహ్లీపైనే ఉండనున్నాయి. కెప్టెన్ డుప్లెసిస్తో పాటు ఆర్సీబీ టాప్ స్కోరర్గా ఉన్న విరాట్ గత రెండు మ్యాచ్ల్లో ఫెయిలయ్యాడు. ఈ నేపథ్యంలో తనకు మంచి రికార్డున్న ఉప్పల్ స్టేడియంలో రెచ్చిపోవాలని చూస్తున్నాడు. మరోవైపు కోహ్లీ కోసం హైదరాబాద్ ఫ్యాన్స్ స్టేడియానికి పోటెత్తనున్నారు.